ఒకప్పుడు నటీనటులు ఒకే భాష చిత్రాలకు పరిమితమై ఉండే వారు. మహా అయితే మన సౌత్  అన్ని భాషల సినిమాలలో నటించే వారు కానీ ఉత్తరాది వైపు వెళ్లే వారు కాదు కానీ ఇటీవల కాలంలో సినిమాకు హద్దులు లేని విధంగా చూస్తుండడంతో మన సౌత్ నటీ నటులు బాలీవుడ్ లో నటిస్తుండడం వారికి ఎంతో క్రేజ్ తెచ్చిపెడుతుంది. తొలి సినిమా తోనే వారు ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. మారుతున్న కాలంతో పాటు మనం మారాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో టైం టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ సినిమాలు చేస్తే హిట్ మన సొంతం అవుతాయి.

సౌత్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో మన టాలీవుడ్ కోలీవుడ్ నటులు బాలీవుడ్ లో నటిస్తుండటం ఆసక్తికర పరిణామం సృష్టిస్తుంది. విజయ్ దేవరకొండ , సమంత అక్కినేని, నాగచైతన్య, రష్మిక మందన, జీవ, విజయ్ సేతుపతి లాంటివాళ్ళు బాలీవుడ్ లో అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అక్కినేని సమంత ఇటీవలే విడుదలైన ఫ్యామిలి మాన్ సిరీస్ లో నెగిటివ్ పాత్ర చేసి అక్కడ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది . నాగచైతన్య కూడా అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ చద్దా సింగ్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 83 సినిమాలో జీవా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ముంబైకర్ అనే సినిమాలో అద్భుతమైన పాత్ర పోషిస్తూ బాలీవుడ్ కి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ లో లైగర్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. రష్మిక సౌత్ లో బిజీగా ఉంటూనే ఉత్తరాదిన కూడా సినిమాలను ఒప్పుకుంటున్నారు ఇలా మనవాళ్ళు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తూ అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: