ఓ సినిమాలో హీరో పాత్ర పవర్ ఫుల్ గా ఉండాలంటే.. కచ్చితంగా హీరో పాత్రకు మించి విలన్ పాత్ర అనేది ఉండాలి.అప్పుడే సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది.ఈ విషయంలో మాస్ దర్శకులు కకాస్త ముందుంటారనే చెప్పాలి.పెద్ద పెద్ద మాస్ డైరెక్టర్లు తమ సినిమాలలో విలన్స్ గా అగ్ర నటులనే తీసుకుంటారు.ఇదే క్రమంలో ఇతర ఇండ్రస్టీలకు చెందిన హీరోలను కూడా అప్పుడప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు మన తెలుగు టాప్ డైరెక్టర్లు.అలాంటి అగ్ర దర్శకుల్లో మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరని కచ్చితంగా చెప్పొచ్చు.ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

మరి అందులో సెకండ్ హీరో ఎవరు?ఆఫ్రికన్ అడవుల్లో సాగే కథతో రాజమౌళి, మహేష్ సినిమా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.దానికోసం ఓ ఆఫ్రికన్ నవల హక్కులను కూడా తీసుకున్నారని సమాచారం.మరి అందులో విలన్ కచ్చితంగా ఉంటారు.మరి ఆ విలన్ ఎవరు?ఇక మన జక్కన్న స్టైల్ లో చూస్తే ఇతర భాషల్లో దుమ్ము దులిపిన వారినే ఇక్కడికి తీసుకొస్తుంటారు.ఇటీవల కాలంలో అదే జరిగింది.మన బాహుబలి లో రానా పాత్ర కూడా అలానే ఉంటుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ లో అయితే ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలను తీసుకున్నారు.మరి ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమాలో ఆ భారీ విలన్ ఎవరై ఉంటారు అనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇక ఈ సినిమా విషయానికొస్తే అటు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఇటు మహేష్, త్రివిక్రమ్సినిమా అనంతరం వీరి కాంబో మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించనుంది.థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: