మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన "వరుణ్ తేజ్" తో తొలిప్రేమ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్"వెంకీ అట్లూరి". తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు డైరెక్టర్. కానీ ఆ తర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమా చేయగా అది డిజాస్టర్ గా మిగిలింది. ఇక నితిన్ తో కలిసి రంగ్ దే సినిమా చేయగా అది కూడా యావరేజ్ గా నిలిచింది. ఇక అయితే హీరో ధనుష్ తో కూడా ఒక ప్రాజెక్టు చేస్తున్నట్లు ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.. ఆ విషయాలను మనం కూడా ఒకసారి చూద్దాం.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పిమ్మటె వెంకీ అట్లూరి తో కూడా ఒక సినిమాను చేయబోతున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో  స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి రెమ్యునరేషన్ కి దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా పూర్తి అయ్యే సరికి.. ఇంకా ఎంత  బడ్జెట్ పెరుగుతుందో అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇక ఇందులో ధనుష్ ఒక వ్యవస్థను సక్రమమైన రీతిలో కి తీసుకు వచ్చేటువంటి ఒక యువకుడు కథతో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో మరి కొన్ని ఎమోషన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతానికి ధనుష్ మూడు సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలపైకి ఎక్కించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సినిమా కూడా మూడు భాషలలో నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన రానుందని వినిపిస్తోంది. ఏదిఏమైనా ఈ సినిమాతో కూడా హిట్ కొడితే ఈయన రేంజ్ మరింత పెరిగిపోతుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: