టాలీవుడ్
సినిమా పరిశ్రమలో ఎన్నో అంచనాల తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం లవ్ స్టోరీ. అక్కినేని
నాగచైతన్య హీరోగా
సాయి పల్లవి హీరోయిన్ గా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం
సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గా ఈ చిత్రం ప్రీ రిలీజ్
ఈవెంట్ ఈ రోజు హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాధా
బాలీవుడ్ హీరో
అమీర్ ఖాన్ కూడా గెస్ట్ గా వచ్చి ఆయన ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.
కరోనా రెండో దశ తర్వాత ఏ
సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించని నేపథ్యంలో ఈ
సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది అని మొదటి నుంచి అందరూ నమ్ముతు ఉండగా ఇప్పుడు ఈ
సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి అని
సినిమా విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆ విధంగా ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తులైన
శేఖర్ కమ్ముల ఈ చిత్రం ను కూడా ప్రేక్షకుల ఫీల్ నీ తగ్గించలేని విధంగా తెరకేక్కించాడట.
ఇకపోతే ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన
చిరంజీవి స్టేజిపై
సాయి పల్లవి తో కలిసి స్టెప్పేయడం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మొదటగా ఈ సినిమాలో వచ్చిన సారంగదరియా పాట
సాయి పల్లవి ఆ తర్వాత
చిరంజీవి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు చిరు తో కలిసి డాన్స్ చేసింది. ఇక ఈ
సినిమా విషయానికి వస్తే పవన్
సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి
సెప్టెంబర్ 24వ తేదీన విడుదల అవుతున్న ఈ
సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.