టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా రచయితగా ఆ సినిమా పనులను పర్యవేక్షిస్తున్నాడు. పవన్ కల్యాణ్ సినిమా కావడంతో ఆయన దర్శకుడు కాకపోయినా కూడా ఈ సినిమాను దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ అలాగే అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమాలు చేసి వరుస సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబుతో త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు.

 మహేష్ బాబు కూడా పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే ఈ సినిమాను పూర్తి చేసి తన తదుపరి చిత్రానికి వెళ్లాలని మహేష్ భావిస్తుండగా ఇటీవలే రాజమౌళి ఆర్ ఆర్ సినిమా సంక్రాంతికి రావడం ఈ సినిమాను పోస్ట్ పోన్ అయ్యేలా చేస్తుంది అని చెబుతున్నారు. మరి దీనిపై చిత్రబృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక మహేష్ బాబు కెరీర్లో 28వ చిత్రం గా త్రివిక్రమ్ సినిమా రాబోతుంది. 

మ్యూజిక్ డైరెక్టర్ ల విషయం లో త్రివిక్రమ్ కు అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ విధంగా త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ మణిశర్మ ల తో ఇప్పటివరకు కొన్ని సినిమాలు చేశాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే సమయంలో ఆయన సినిమాలకు జల్సా మరియు అత్తారింటికిదారేది సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.  అయితే ఆయనతో చేసిన మూడవ సినిమా అజ్ఞాత వాసి కి అనిరుధ్ ని ఎంపిక చేసుకున్నాడు. అలాగే అల్లు అర్జున్ తో చేసిన జులాయి మరియు సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా వీరి కాంబో లోని మూడవ సినిమా అల వైకుంఠపురం సినిమాకి తమన్ సంగీతం అందించాడు. మణిశర్మ తో మహేష్ బాబు హీరోగా అతడు ఖలేజా వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు మహేష్ తో చేయబోయే మూడో సినిమాకు మాత్రం తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఆ విధంగా ఒక హీరో తో తాను మూడవ సినిమా చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ మార్చి ఒక హిట్టు ఒక ఫ్లాప్ పొందిన త్రివిక్రమ్ మహేష్ తో చేయబోయే మూడో సినిమాతో ఏ విధమైన హిట్ అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: