వీరిద్దరి కాంబినేషనల్ వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరొకసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై అభిమానులు భారీగానే అంచనా వేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేడ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్ వర్క్ పూర్తి అయిందని సమాచారం. జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి సమీపంలోనే ఈ చిత్రం సెట్ నిర్మిస్తున్నట్టుగా కొరటాల శివ పేర్కొన్నారు. ప్రస్తుతం తారక్కు ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని స్క్రీప్టులో కొన్ని కీలక మార్పులు చేశాడట. ఇప్పుడు ఇక స్క్రీప్ట్ వర్క్ పూర్తయిందని.. ఎన్టీఆర్ కూడ ఫుల్ స్క్రిప్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మిక్కిలినేని సుధాకర్ చిత్రానికి నిర్మాతగా మారుతున్నారు. కళ్యాణ్రామ్ సమర్పకుడిగా ఉన్నాడని సమాచారం. గతంలోనే ఈ చిత్రం గురించి ప్రకటించినా.. కరోనా కారణంగా అది కుదరలేదు. దర్శకుడు కొరటాల శివ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న విషయం విధితమే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్గా నటించనున్నదని తెలుస్తోంది. ఇప్పటికే అలియా ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్కు జోడిగా నటిస్తున్న సంగతి తెలిసినదే.