టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత - నాగచైతన్య ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుని తెలుగు చిత్ర పరిశ్రమకి షాక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే సమంత సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్ట్‌లు పెడుతూ మనసులో బాధను తెలియజేస్తుంది.
అయితే సమంత విడాకుల తరువాత వరుస సినిమాతో బిజీగా ఐపోయింది. అంతేకాకుండా ఆమె విడాకుల తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే నాగచైతన్య కూడా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే మొదటి సారి సమంత నాగచైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించడంతో ఈ వార్త వైరల్ అవుతుంది. 
ఇటీవల కాలంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని నాగార్జున మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతున్నాయి.
నాగార్జున మాట్లాడుతూ.. సమంత మాతో చాలా తొందరగా కలిసిపోయిందని అన్నారు. ఇక ఆ అమ్మాయి మమల్ని అందరిని చాలా బాగా చూసుకునేదని వెల్లడించారు. అంతేకాదు.. సమంత అందరితో ఎంతో సరదాగా కూడా ఉండేది.. నాకు అమలకి సమంత ఒక కోడలిగా కాకుండా ఒక కూతురిలా ఉండేదని వెల్లడించారు. అయితే చైతు సమంత విడిపొయే పరిస్థితి ఒక్కటి వస్తుంది అని మేము కలలో కూడా ఊహించలేదని అన్నారు.
ఇక వాళ్ళిద్దరి మధ్య అలాంటి విభేదాలు వచ్చి ఉండాల్సింది కాదు.. సర్దుకుపొయి ఉంటే బాగుండేదని అన్నారు. సమంత ఇప్పుడు మాతో కలిసి లేకపోయినా కూడా నేను నా కూతురి లాగానే భావిస్తానని పేర్కొన్నారు. అంతేకాక.. ఆమె తన కెరీర్‌లో ఇంకా పైకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు. అలాగే ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య కలిసి బంగార్రాజు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్‌గా చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: