గత మూడు రోజుల నుంచి ధనుష్ మరియు ఐశ్వర్యలా విడాకుల వ్యవహారం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా ఇదే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రం బ్రేక్ అప్ లు, విడాకులు వారు చాలా కామన్ గా తీసుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు విడిపోయి జీవిస్తున్నారు. అలాంటి ఘటనకు సంబంధించినదే ధనుష్ ఐశ్వర్య విషయం. మరి వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందామా..?ధనుష్ ఐశ్వర్యలు విడిపోవడానికి అసలు కారణం ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అని చెప్పవచ్చు.

అయితే వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం అమలాపాల్ అని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ అమలాపాల్  ప్రముఖ దర్శకుడు ఎల్ విజయ్ ని పెళ్లి చేసుకుంది. ఆయన దర్శకత్వం వహించిన నాన్న సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలోనే ఎల్ విజయ్ అమలాపాల్ మధ్య ప్రేమ చిగురించిందని 2014 జూన్లో వారిద్దరూ  వివాహం చేసుకున్నారు. అయితే విజయ్ అమల వివాహము మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు.

 మూడు సంవత్సరాలు గడవకముందే వీళ్లిద్దరు విడాకులు కూడా తీసుకున్నారు. అయితే విజయ్ అమలాపాల్ విడిపోవడానికి ప్రధాన కారణం ధనుష్ అని అప్పట్లో చాలా పుకార్లు లేషాయి. . అమల వివాహ సమయంలోనే ధనుష్ తో కలిసి విఐపి సినిమాలో నటించింది. ఈ తరుణంలో ధనుష్ అమలాపాల్ మధ్య ఏదో నడుస్తుందనే కారణంతోనే విజయ్ తో విడిపోయిందని విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. అప్పట్లో సుశీ లిక్స్ ద్వారా విడుదలైన ధనుష్ ఐశ్వర్య వ్యవహారం విజయ్ అమలాపాల్ మధ్య మనస్పర్ధలు తెచ్చాయనే వ్యవహారం కూడా బాగా నడిచింది. ఈ కారణం వల్లనే ఐశ్వర్య ధనుష్ మధ్య మనస్పర్థలు వచ్చాయని  అందుకే వారు ఈ డిసిజన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ఇంకా ఏం జరిగిందనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: