యువి క్రియేషన్స్ పతాకంపై రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న సినిమా రాధే శ్యామ్.. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 30 2021 తేదీన తెలుగు ,తమిళ్, హిందీ, కన్నడ , మలయాళం భాషలలో విడుదల చేయబోతున్నారు అనే వార్తలు పెద్దఎత్తున ప్రచారం అయ్యాయి.. షూటింగ్ లో కొంత భాగం పెండింగ్లో ఉండటంతో వాయిదా వేశారు కానీ ఫిబ్రవరి 14 2021 న దాదాపు 11 నెలల కిందట ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేసి ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచారు.


తిరిగి డిసెంబర్ వరకు ఈ సినిమాకు సంబందించిన ఎటువంటి అప్డేట్ను ప్రేక్షకులకు ఇవ్వకపోవడంతో ఏకంగా రెబల్ స్టార్ అభిమాని సూసైడ్ నోట్ కూడా రాసి దర్శకనిర్మాతలదే బాధ్యత అంటూ సంచలనం సృష్టించాడు. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసి కొంత వరకు ఊరట కలిగించారు. ఇకపోతే కరోనా వచ్చిన తరువాత చాలా సినిమాలు ఓ టీ టీ  వేదికగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక నారప్ప వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలలో విడుదల కావడంతో అందుకే పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓ టీ టీ లో విడుదల అవటానికి వెనుకాడడం లేదు.

ఇక జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించిన ఈ చిత్రం యూనిట్..కరోనా  కారణంగా కూడా వాయిదా పడటంతో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత ఓ టీ టీ లో విడుదల చేస్తారని వార్తలు పుకార్లు లాగా పుట్టుకొచ్చాయి.. ఈ విషయంపై స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తప్పకుండా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు.. దీంతో ప్రేక్షకులు సైతం థియేటర్లలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: