పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి అతి త్వరలో రానున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తీసిన ఈ రొమాంటిక్ లవ్ కం యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు కీలక పాత్ర చేసారు. బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించగా ఇతర పాత్రల్లో జయరాం, మురళీశర్మ, ప్రియదర్శి, షాషా ఛత్రి తదితరులు నటించారు.

వాస్తవానికి ఈ పాటికి థియేటర్స్ లో సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాతో పాటు మరోవైపు ప్రశాంత్ నీల్ తో సలార్, ఓం రౌత్ తో ఆదిపురుష్, అలానే నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె వంటి భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఇక వీటి షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతుండగా ప్రభాస్ ప్రస్తుతం కొందరు యువ దర్శకుల నుండి కూడా కథలు వింటునున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం యువ దర్శకుడు మారుతిని ప్రత్యేకంగా పిలిపించి ఒక కథని సిద్ధం చేయమని ప్రభాస్ చెప్పారని, ఆయన కోసం ఒక అద్భుతమైన థ్రిల్లర్ యక్షన్ కామెడి ఎంటర్టైనర్ మూవీని మారుతీ సిద్ధం చేసారని, త్వరలో ఆ మూవీ స్టోరీని ప్రభాస్ కి వినిపించిన అనంతరం దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ బయటకు రానుందని టాక్.

అలానే దానితో పాటు ప్రాజక్ట్ కె డైరెక్టర్ నాగ అశ్విన్ తో మరొక భారీ మూవీ స్టోరీ ని కూడా ఓకె చేసిన ప్రభాస్, కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రాబోయే మూడు నాలుగేళ్ళ వరకు ప్రభాస్ డైరీ ఖాళీ ఉండేలా కనపడడం లేదని, మరోవైపు ఇటీవల వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న మెగాస్టార్ ని ఈ విషయంలో ప్రభాస్ బీట్ చేసి మరింత వేగంగా ఒక్కొక్కటిగా ప్రాజక్ట్స్ సైన్ చేస్తూ వెళ్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. మరి రాబోయే ఈ సినిమాల ద్వారా ప్రభాస్ ఏ స్థాయి విజయాలు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: