మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మరి కొద్ది గంటలలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ట్రెండీ గా మారుతోంది. మహేష్ బాబు డైలాగులతో మాస్ ప్రేక్షకులను సైతం ప్రశంసల వర్షం అందుతున్నాయి. సంగీత దర్శకుడు థమన్ తన సంగీతంతో ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రంపై విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. సరిలేరు నీకెవ్వరు, మహర్షి, భరత్ అనే నేను వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకునన్నాడు మహేష్ బాబు . ఇప్పటివరకు సర్కారు వారి పాట చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఈ చిత్రంతో మరొకసారి మహేష్ బాబు తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ వేసుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈ విషయాన్ని అభిమానులు కూడా భావిస్తున్నారు. చిత్ర బృందం మొత్తం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నది. ఇక డైరెక్టర్, హీరో తదితరులు కూడా ఈ ప్రమోషన్లలో పాల్గొనడం జరుగుతూ వస్తోంది. అయితే ఇలా ఉండగా మహేష్ బాబు చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు బాలీవుడ్ పై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

బాలీవుడ్ ఎంట్రీ పై స్పందిస్తూ మహేష్ బాబు తనని బాలీవుడ్ భరించలేదని అందుకే తాను ఇక్కడే ఉండడం ఇష్టం అని తెలిపారు. ఇక అక్కడికి వెళ్లి టైం వేస్ట్ చేసుకోవాలని లేదని తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అభిమానులను సంపాదించడం చాలా ఆనందంగా ఉందని మహేష్ తెలియజేశారు. అయితే ఈ విషయాలపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ. హీరోగా మహేష్ ఎంపిక బాలీవుడ్లో ఉండనే ఉంటుంది. కానీ అతడిని భరించ లేదన్న అతని ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని బాలీవుడ్ అంటే ఒక కంపెనీ కాదని.. మీడియా ఇచ్చేది కేవలం ఒక్కో కంపెనీ లేదా ప్రొడక్షన్ హౌస్ వంటిదని తెలియజేశారు. మహేష్ సేవ ఉద్దేశంతో అన్నారో ఏమో తెలియదంటూ ఆర్జివి కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: