ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఐకాన్ గా ప్రశాంత్ నీల్ మారిపోయాడు. ఒక సినిమాను ఎలాతీయాలి ఆమూవీ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అన్నవిషయంలో చాలామంది ప్రశాంత్ నీల్ కు ఏకలవ్య శిష్యులుగా మారుతున్నారు. ‘బాహుబలి 2’ రికార్డులను కూడ ‘కేజీ ఎఫ్ 2’ బ్రేక్ చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రశాంత్ నీల్ హవా మాత్రమే కనిపిస్తోంది.


ఇలాంటి పరిస్థితులలో ప్రశాంత్ నీల్ కు కొనసాగుతున్న కన్ఫ్యూజన్ పై ఆశక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంచలన దర్శకుడు ప్రభాస్ తో ‘సలార్’ తీస్తున్నాడు. ‘కేజీ ఎఫ్ 2’ ఫలితం ప్రభాస్ వరస ఫ్లాప్ లు తరువాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తీస్తున్న ‘సలార్’ విషయమై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఈమూవీ షూటింగ్ ఈసంవత్సరాంతం వరకు కొనసాగే ఆస్కారం ఉంది.


ఈమూవీ తరువాత ప్రశాంత్ నీల్ జూనియర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రశాంత్ నీల్ దృష్టిలో రామ్ చరణ్ మహేష్ లు కూడ ఉన్నారు అంటూ లీకులు కూడ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈయాక్షన్ ప్లాన్ అంతా మారిపోయినట్లు కనిపిస్తోంది. దీనికికారణం ప్రశాంత్ నీల్ దృష్టి ఇప్పుడు ‘కేజీ ఎఫ్ 3’ పై పడింది అంటూ కన్నడ మీడియా వార్తలు వ్రాస్తోంది.


కోలార్ బంగారు గనుల మాఫియా చుట్టూ తిరిగిన ‘కేజీ ఎఫ్’ పార్ట్ 1 – పార్ట్ 2 కథ ఇప్పుడు రూట్ మార్చుకుని ఆఫ్రికన్ బంగారు గనుల చుట్టూ తిరిగే కథగా ఆఫ్రికన్ బమారు గనుల మాఫియా చుట్టూ తిరిగే కథగా మారుతోందని టాక్. ఈమూవీలో కూడ యష్ హీరోగా నటిస్తాడని ఈమూవీని సుమారు 62 దేశాలలోని వివిధ ప్రాంతాలలో షూట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీని వచ్చే ఏడాది మొదలుపెట్టి 2024 సమ్మర్ రేస్ కు విడుదల అయ్యేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీనితో ఇప్పట్లో మన టాప్ హీరోలతో ప్రశాంత్ నీల్ కు సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు అన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: