మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అయిన బ్యాంకర్ అమృత ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ 75 వ ఫిలిం ఫెస్టివల్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భాగంగా ఆమె రెడ్ కార్పెట్ పై నడిచాడు ఆమె నడిచిన ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా అమృత ఈ స్టోరీలను పోస్ట్ చేస్తూ.. ఆహారం, ఆరోగ్యం మరియు స్థిరత్వం గురించి అవగాహన కలగడం చేతనే ఈ రెడ్ కార్పెట్పై నడిచానని పోస్ట్ చేసింది.అమృతతో తోపాటు ఐవరీ కోస్ట్ ప్రధమ మహిళ డొమినిక్ లెబినీస్ జోర్డానియన్ యువరాణి గిడా తలాల్ నటుడు స్టోన్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అమృత చేసిన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల ఉక్రెయిన్లో మహిళలు యువత పై రష్యా సైనికులు అఘాయిత్యాలను ఆపండి అంటూ ఉక్రెయిన్  చెందిన నటి ఒకరు  అర్థనగ్నంగా ఫోటోలతో నిరసన తెలిపింది. ఇక తన దుస్తులను విప్పి కూడా అర్ధనగ్నంగా నిలిచింది ఆమె శరీరంపై విక్రయం జెండా రంగులు వేసుకుని.. అక్కడి ప్రజల పై జరిగే అఘాయిత్యాలను అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేస్తోంది.మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ 2005లో సామాజిక కార్యకర్తగా ఉన్న అమృత ను వివాహం చేసుకున్నారు. ఆ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఏమి ఒక సాధారణ మహిళ. నాగపూర్లోని కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో ఈమె గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తరువాత ఫైనాన్షియల్గా ఎంబీఏ పూర్తి చేసింది. స్కూల్ స్టేజి లో ఉండగా రాష్ట్ర స్థాయి అండర్-16 టెన్నిస్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక అమృత కూడా విభిన్న రంగాలలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె క్లాసికల్ సింగర్ కూడా. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: