తెలుగులో అంతే జోష్ చూపిస్తోంది అనలేము... కానీ విక్రమ్ వంటి సీనియర్ స్టార్ హీరో పోటీని తట్టుకుని నిలబడి డీసెంట్ కలెక్షన్లు అందుకుని సత్తా చాటుతోంది. డాగ్ డ్రామా గా మన ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటూ హౌస్ఫుల్ బోర్డ్ పెట్టిస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో 45 కోట్లు, తమిళనాడులో 2 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 90 లక్షలు రాబట్టిన 777 ఛార్లీ, కేరళలో ఏకంగా 3 కోట్ల మార్క్ ని దాటి ఔరా అనిపిస్తోంది. ఇక పోను పోను గ్రాస్ మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అయిన పది రోజులకే కలెక్షన్లు భారీగా రాబడుతోంది అంటే పెద్ద విశేషమే .
ఇందులో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కిరణ్ రాజ్ కె దర్శకత్వం వహించాడు. మరికొన్ని పాత్రలలో బాబీ సింహ, సంగీత శృంగేరి లు నటించి మెప్పించారు.