పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి మనకి తెలియంది కాదు.ఈయన నటించిన బాహుబలి సినిమా అనంతరం ఇప్పటి వరకు వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.అంతేకాదు  'బాహుబలి' తర్వాత ప్రభాస్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. ఇక ఈయన నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు, ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా ప్రభాస్ కూడా ఓకే జానర్‌లో సినిమాలు చేయకుండా ఆడియెన్స్ రుచికి తగ్గుట్టు కథలను ఎంపిక చేసుకుంటున్నాడు.  అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ kgf ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' ఫిల్మ్ చేస్తున్నారు.

 అయితే ఈ చిత్రంపైన అందరికి  భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇదిలావుంటే ఇటీవల ప్రభాస్ గత చిత్రం 'రాధే శ్యామ్' .ఇకపోతే ప్రభాస్ నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఇకపోతే ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ అయిన 'సలార్' డెఫినెట్ గా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే తెలంగాణలోని రామగుండంలో 'సలార్' చిత్ర షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇకపోతే ప్రజెంట్..రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలావుంటే ఇక ఇందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది.

 అయితే మాలీవుడ్(మలయాళం) మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు వినికిడి.అంతేకాక యాక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా 'సలార్' ఉండబోతున్నదని  ప్రస్తుతం భారీ వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేయబోతున్నారట. అయితే, ఇక ఈ వార్తల్లో నిజమెంతుందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు  మనమందరం వెయిట్ చేయాల్సిందే.ఇకపోతే  సోషల్ మీడియాలో వస్తున్న వార్త ల ప్రకారం..సప్తగిరి ఇప్పటికే 'సలార్' సినిమా కోసం డేట్స్ కేటాయించారట.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆదిపురుష్' వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.పోతే  మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'తన్హాజీ' ఫేం ఓ రౌత్ తెరకెక్కించాడు.ఇక  దీనితో పాటుగా నాగ్ అశ్విన్‌తో 'ప్రాజెక్ట్-K' చిత్రాన్ని చేస్తున్నాడు. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: