ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో వేణు తొట్టెంపూడి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పోటీలో కనుమరుగై పోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే హీరోగా అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారమెత్తి సినిమాల్లో నటించాడు.  ముఖ్యంగా బోయపాటి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దమ్ము సినిమాలో కనిపించాడు.. ఇక అదే ఇండస్ట్రీ లో అతనికి చివరి సినిమా అని చెప్పాలి. ఆ తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు. అయితే ఆరేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఎస్ఐ మురళి పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక రామారావు ఆన్ డ్యూటీ పాత్రలో మురళి పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది అన్నది మాత్రం తెలుస్తోంది. ఈ సినిమా నేపథ్యంలో ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు వేణు తొట్టెంపూడి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమాలకు దూరంగా ఉండటంతో తన ఫ్యామిలీ పరంగా వచ్చిన బిజినెస్ ల తో బిజీ గానే ఉన్నాను అంటూ తెలిపాడు. అయితే తనకు సినిమాలు లేకపోవడంతో ఇక ఆర్థిక సమస్యల కారణంగా చికెన్ కొట్టు పెట్టుకున్నాను అన్న వార్తలు మీడియాలో వచ్చాయని గుర్తు చేసుకున్నాడు వేణు తొట్టెంపూడి.


 ఈ క్రమంలోనే  తన స్నేహితులు కొంతమంది ఫోన్ చేసి చికెన్ కొట్టు పెట్టుకున్నావ్ అంట కదా నాకు కూడా కిలో చికెన్ పంపించు అంటూ సరదాగా జోకులు కూడా వేశారు అంటూ చెప్పుకొచ్చాడు. నా గురించి ఇలాంటి వార్తలు ఎన్నో సోషల్ మీడియా లో చూశాను అంటూ తెలిపాడు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి.  స్వయంవరం సినిమాలో వేణు కు జంటగా నటించిన లయతో అతనికి ఎఫైర్ ఉందంటూ ఎన్నో పుకార్లు అప్పట్లో హల్ చల్ చేశాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: