ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు పక్కన నటించేందుకు హీరోయిన్లు చాలా పోటీపడుతుంటారు.ఆయనతో ఒక్క ఛాన్స్ కోసం హీరోయిన్లు ఎంత గానో ఎదురుచూస్తూ ఉంటారు.సూపర్ స్టార్ మహేష్ వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి.ఎన్నో భారీ అంచనాలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో ఇప్పటికే పొడుగు కాళ్ల సుందరి బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఎంపికైంది. ఇక హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్లు ఇంకా అలాగే సెట్‌పై ఎలా వెళ్ళాలో చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.కాగా, కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాకి అవసరం.అందుకే శ్రీలీల మరో నాయికగా నటించనున్నట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. 


అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మలయాళ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ని ఎంపిక చేస్తున్నారని చాలా స్ట్రాంగ్ గా సమాచారం తెలిసింది.సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఈ వార్త వైరల్ అవుతుండగా ఈసారి ఈమెని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈమె నానితో గ్యాంగ్ లీడర్` సినిమాలో నటించింది. తమిళంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన `డాక్టర్` ఇంకా `డాన్ చిత్రాల్లో నటించింది.ఇందులో ఆమె పాత్ర తక్కువైన మెగా బేనర్ పైగా సూపర్ స్టార్ మహేష్ హీరో కనుక అంగీకరించిందని కూడా చిత్ర యూనిట్ చెబుతోంది. అతి త్వరలో ఈ సినిమా సెట్‌పైకి వెళ్ళనుంది. ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలో ట్యూన్స్ కార్యక్రమాలు కూడా చెన్నైలో జరుగుతున్నాయి.సర్కారు వారి పాట సినిమాకి చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.ఇంకా త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: