యంగ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీ ల ద్వారా వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 25 వ తేదీన తెలుగు ,  హిందీ , తమిళ ,  కన్నడ , మలయాళ భాషల్లో విడుదల అయ్యింది.  భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలు అయినప్పటికీ అనన్య పాండే కు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. దానితో ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా అనన్య పాండే ను తీసుకోవాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే అనన్య పాండే కు అదిరి పోయే ఆఫర్ వచ్చినట్లే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: