జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన ఫుల్ క్రేజ్ ను దర్శకుడుగా సంపాదించుకున్న అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతి రత్నాలు మూవీ తో ఒక్కసారిగా అనుదీప్ కేవి క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయింది. అలా జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ యువ దర్శకుడు తాజాగా కోలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే మూవీ ని తెరకెక్కించాడు.

మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 21 వ తేదీన భారీ ఎత్తున తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే జాతి రత్నాలు మూవీ తర్వాత అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో , ఈ మూవీ పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే ...  ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ప్రిన్స్ మూవీ కి సీడెడ్ లో ఒక కోటి వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. టోటల్ ఆంధ్ర ప్రదేశ్ మరో 3 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా 7 కోట్ల షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించినట్లు అయితే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: