సోషల్ మీడియాలో నిన్నటి నుండి పవన్ నామస్మరణ హోరెత్తుతోంది .ఇక దీనికి కారణం త్వరలోనే పవన్ కళ్యాణ్ మరో పాన్ ఇండియా యాక్షన్ మూవీకి శ్రీకారం చుట్టడమే దీనికి కారణం .త్రిబుల్ ఆర్ సినిమాని నిర్మించిన డివివి విధానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కాగా  సాహో మరియు రన్ రాజా రన్ వంటి సినిమాలు తిరగెక్కించిన సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ ప్రకటన అధికారకంగా రావడం జరిగింది. ఈ ప్రకటన అనంతరం సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ మేనియాతో ఊగిపోతుంది .దీంతో ఫాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

తన తోటి స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను  సంపాదించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రీమిక్స్ సినిమాలు చేస్తూ ఉన్నారు. దీంతో ఫాన్స్ అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో వారి అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా హరిహర వీరమల్లు లాంటి పిరియాడిక్ పాన్ ఇండియా సినిమాలతో పాటు సుజిత్ డైరెక్షన్లో భారీ యాక్షన్ సినిమాను మరియు హరీష్ శంకర్ తో మరో సినిమా చేయడంతో పవన్ అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి .అయితే నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించిన

 పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా కాంబినేషన్ పై టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం వారి సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అంతేకాదు కుర్ర హీరోలు అయినా మంచి మనోజ్, వరుణ్ సందేశ్ ,సాయి ధరంతేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే వరస సెలబ్రిటీలందరూ క్యూ కడుతూ ఈ ప్రాజెక్టుపై తమకి ఉన్న కుతూహలంని చూపించడం జరిగింది. అయితే కేవలం పవన్ నటించిన ఒక్క సినిమా ప్రకటన ఇంతటి ప్రకంపనలు గతంలో ఏ ప్రాజెక్టు కి కూడా రాలేదు .వచ్చే ఏడాది  ప్రారంభం కాబోతున్న ఈ సినిమాని 2023 దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్రబృందం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: