బాలకృష్ణ ఇప్పటికే అఖండ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆఖరుగా అఖండ మూవీ తో అద్భుతమైన విజయం అందుకున్న బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా ... గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ కీలక పాత్రలలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా జనవరి 6 వ తేదీన రాత్రి 8 గంటల 17 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో బాలకృష్ణ వెరీ పవర్ ఫుల్ లుక్ లో ఉన్నాడు.  ఈ సినిమా ట్రైలర్ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: