టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పలు విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం తారకరత్న మరణం వార్త మరువకముందే ఇప్పుడు తాజాగా మరొక విషాదం నెలకొంది.ఫిబ్రవరి 2వ తేదీన ప్రముఖ నటుడు, డైరెక్టర్ కళాతపస్వికే విశ్వనాథ్ గారు కన్నుమూయడం జరిగింది. ఇక ఈ విషాద వార్త ఇప్పుడు మరవకముందే ఆయన భార్య కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితమే మరణించినట్లుగా తెలుస్తోంది.హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. కే విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఈమె తీవ్ర అనారోగ్య సమస్యకు గురైనట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డులో ఈమెకు చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం.


అయితే అనారోగ్య పరిస్థితులు విసమించడంతో ఈరోజు సాయంత్రం 6 :15 నిమిషాల ప్రాంతం లో ఇమే తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. తమ తండ్రి కె విశ్వనాథ్ గారు కన్ను మూసిన వార్డులోనే తమ తల్లి కూడా జయలక్ష్మి మరణించడంతో చాలా దురదృష్టకరమని వారు ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇక ఈమె పార్దివ దేహాన్ని కూడా కొద్దిసేపట్ లో ఫిలింనగర్ ప్రాంతం లో ఉన్న నివాసానికి తరలించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.


రేపటి రోజున పంజాగుట్ట స్మశాన వాటిక లో ఆమె అంత్యక్రియలు జరపబోతున్నట్లు ప్రకటనలో తెలియజేయడం జరిగింది.శ్రీ కాశీనాధుని జయలక్ష్మి వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు ఈమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కే విశ్వనాథ్ గారితో వివాహం జరిగిందట. విశ్వనాథ్ గారి మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఈమె మంచానికే పరిమితమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒకే నెలలోనే విశ్వనాథ్ గారు తన భార్య మరణించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: