టాలీవుడ్ లో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దృశ్యంతుడి పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్లో కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, పోస్టర్స్ బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి పలు ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు గుణశేఖర్ తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.


శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రను మొదటి అనుకొన్నది దేవి మోహన్ ని కాదట.. హీరో దుల్కర్ సల్మాన్ ని అనుకోక .. అయితే అప్పటికే దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డేట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాకు నో చెప్పారట. కానీ ఈ పాత్ర కోసం తెలుగు హీరోలను ఎంపిక చేయకపోవడానికి ముఖ్య కారణం టాలీవుడ్ హీరోలు ఎవరు ఈ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదని తెలియజేశారు గుణశేఖర్.


అందువల్లే ఎవరిని కూడా ఈ పాత్ర కోసం బలవంతం చేయలేదని ఒక మలయాళం నటుడిని తీసుకున్నట్లు తెలియజేశారు. గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కాబోతున్నది.నీలిమ గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే అల్లు అర్హ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు సాయి మాధవ్ బుర్ర రచన సహకారం అందించడం జరిగింది. ఈ సినిమా కోసం సమంత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: