తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ నటుడు ఉప్పెన అనే మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించగా ... మైత్రి మూవీ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో వైష్ణవ్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించడంతో ఈ నటుడు కి ఈ సినిమా తర్వాత క్రేజీ సినిమాలో అవకాశాలు వచ్చాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు ఉప్పెన మూవీ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా అనే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లుగా మిగిలాయి. ఇలా ఉప్పెన మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత నటించిన రెండు మూవీ లతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు "ఆది కేశవ" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీకాంత్ ఎం రెడ్డిమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ వంశీ ఎస్ ... సాయి సౌజన్య ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ఆగస్టు 18 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ  మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో వైష్ణవ్ ... శ్రీ లీల ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: