కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో సెన్సేషన్ సృష్టిస్తూ ఉన్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇక ఈ డైరెక్టర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ హీరోతో సినిమా తీసిన అది బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది. వసూళ్లతో ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతుంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న విక్రమ్ అనే సినిమాతో సెన్సేషన్ సృష్టించిన లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో అనే సినిమా చేస్తూ ఉన్నాడు. అయితే గతంలోనే వీరి కాంబినేషన్లో మాస్టర్ అనే సినిమా వచ్చి ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో సినీ ప్రేక్షకులందరికీ కూడా తెలుసు.


 ఇప్పుడు వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లోకి వెళ్లిపోయాయి. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కూడా మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది అని చెప్పాలి. ఇక అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ కూడా ప్రమోషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది.



 దళపతి విజయ్ లియో మూవీ రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీ రెండు గంటల 39 నిమిషాల రన్ టైం కలిగి ఉంటుందని తెలుస్తుంది. కాగా సెవెన్ స్క్రీన్ స్టూడియో ఇక ఈ మూవీని నిర్మిస్తూ ఉండగా.. యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పాటలు సోషల్ మీడియాలో సెన్సేషనల్  సృష్టించాయి అని చెప్పాలి. కాగా లోకేష్ కనకరాజు మరోసారి లియో మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయం అని అటు సినీ ప్రేక్షకులందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: