సినిమా ఇండస్ట్రీ లో వరుస గా సినిమాలు చేస్తూ మంచి హిట్లు కొట్టే డైరెక్టర్లు తగ్గిపోయారు. కొద్దీ సంవత్సరాల క్రితం వరకు కూడా పూరి జగన్నాద్ వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీ లో ఒక టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.కానీ ఆయనకి తీసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం తో ఇక ఫాస్ట్ గా సినిమాలు చేయకుండా కొంచం స్లో గా సినిమాలు చేస్తూ ఉండిపోయాడు.

నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి. అయిన కూడా కొన్నిప్లాప్ వల్ల మాత్రమే ఆయన ఫాస్ట్ గా సినిమా లు చేయడం మానేశారు.కానీ ఆయన అప్పట్లో వరుసగా ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ బిజినెస్ మ్యాన్, బుజ్జిగాడు లాంటి మంచి విజయాలను కూడా అందుకున్నారు. ఆయన రాసే పంచ్ డైలాగ్స్ అన్ని కూడా ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ జనాలు కూడా మిస్ అవుతున్నారు.  ఇక ఇప్పుడు మళ్లీ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా కి సిక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఇక మళ్లీ స్టార్ హీరో లతో పూరి వరుసగా సినిమాలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది.అందుకే పూరి జాగ్రత్త గా ఈ సినిమా తీయాలని చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నట్టు గా తెలుస్తుంది.పూరి ఒకసారి ఒక సినిమా తీసి హిట్ కొట్టాలి అంటే ఆయన అను కుంటే అవుతుంది కానీ ఆయన లైట్ తీసుకొని సినిమాలు చేస్తే నే సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి.మళ్లీ ఈ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కొట్టాలని మళ్లీ ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు తీయాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటు న్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: