
తాజాగా మోడీ ప్రభుత్వం గృహ వినియోగ సిలిండర్ల ధరలను రూ.200 మేరా తగ్గించి సామాన్యులకు శుభవార్త అందించింది .అయితే ఇప్పుడు ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.209 పెంచడంతో ఇప్పటికే ఆహార ధాన్యాల ధరల పెరుగుదలతో నష్టపోతున్న హోటల్ వ్యాపారులు, ఇతర ఆహార పరిశ్రమలు ఇప్పుడు మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2023లో చమురు కంపెనీలు దేశీయ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలలో పెద్ద కోత విధించగా గత నెలలో 19 కిలోల సిలిండర్ ధర రూ .158 వరకు తగ్గింది.
దీని తర్వాత రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1522 కి చేరుకోగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల ప్రభావం వల్ల హోటల్ రెస్టారెంట్లలో తినడం మరియు తాగడం కూడా ఇప్పుడు ఖరీదయింది. ఎందుకంటే ఒకవైపు ఆహార ధాన్యాలు ధరలు పెరగడంతో పాటు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా ధరలు పెరగడంతో ఎటు చూసినా సామాన్యుడికే ముప్పు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక వీటి ధరల పెంపకం వల్ల రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెంచేశాయి.