టాలీవుడ్ చిరంజీవి గా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా ఎవరికైనా సహాయం చేయడంలో కూడా ముందుగానే ఉంటారు. ఎవరు పిలిచినా కూడా మర్యాదపూర్వకంగానే వారిని కలుస్తూ ఉంటారు చిరంజీవి. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి పై నటుడు మాన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్ల పైన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


మన్సూర్ అలీఖాన్ చిరంజీవి, త్రిష ,కుష్బూ మీద పరువునష్టం దావ వేస్తున్నట్లుగా తెలియజేశారు. చిరంజీవి మీద 20 కోట్లు త్రిష కుష్బూ మీద 10 కోట్ల చొప్పున దావా వేస్తున్నట్లు సమాచారం.. చిరంజీవి మీద దారుణమైన కామెంట్స్ చేస్తూ తనది వక్రబుద్ధి అంటున్నాడు.. కదా పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సహాయం చేయలేదంటూ కూడా విమర్శించారు. తన తమ్ముడి కూడా ఎవరో నాకు తెలియదు..ఆయన పార్టీ పెట్టాడట వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలియదు.. ఆ డబ్బంతా వాళ్ల కోసమే ఉపయోగించుకుంటున్నారని ప్రజల కష్టాలను అస్సలు తీర్చడం లేదని త్రిష కుష్బూ చిరంజీవి మీద పరువు నష్టం దావా వేస్తున్నారని త్వరలోనే నా లాయర్ వారికి నోటీసులు పంపుతారంటూ కూడా మాన్సూర్ తెలియజేయడం జరిగింది.


చిరంజీవి అయితే సీనియర్  హీరోయిన్లతో పార్టీ చేసుకుంటారు.. అలాంటి వాటికి ఎప్పుడు తనని పిలవలేదు..ఆయన ఎప్పుడు హీరోయిన్లని పిలుస్తూ ఉంటారు అది ఆయన ఇష్టము.. అయితే ఇలాంటి విషయం స్పందించే సమయంలో తనకు ఒక్కసారైనా ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు నన్ను అడగాల్సింది అంటూ మన్సూర్ అలీఖాన్ మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో  మీద ఫ్యాన్స్ ఒకలాగా స్పందిస్తే యాంటీ ఫ్యాన్స్ మరొక లాగా రియాక్ట్ అవుతూ ఉన్నారు.. మరి ఇలాంటి విషయాల పైన అటు చిరంజీవి త్రిష కుష్బూ వంటి వారు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: