
బాలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా కూడా ఆమెకు గుర్తింపు రాలేదు. అనూహ్యంగా దేవర మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఫస్ట్ ఎన్టీఆర్ కి జంటగా అలియా భట్ అనుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమె సైన్ చేసి కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో జాన్వీ కపూర్ కి ఆఫర్ వచ్చింది. జాన్వీ కపూర్ ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి, ఎన్టీఆర్ తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ లది బ్లాక్ బస్టర్ కాంబో.ఈ క్రమంలో వారి వారసులైన జాన్వీ, ఎన్టీఆర్ కలిసి నటించడం ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అదే సమయంలో సౌత్ ఇండియాకు చెందిన శ్రీదేవి దశాబ్దాల పాటు తెలుగు, తమిళ భాషల్లో అద్భుత చిత్రాలు చేసింది. ఆమె కూతురు జాన్వీ కపూర్ ని సౌత్ చిత్రాల్లో నటింపజేయాలని చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది. అది ఎట్టకేలకు సాకారం అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర 2024 మార్చి 5న విడుదల కానుంది. జాన్వీ కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ ఇది.