టాలీవుడ్ యువ నటిమని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె "అ ఆ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన ఈమె ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపును తెలుగు పరిశ్రమలో దక్కించుకుంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అమాయకంగా నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత కూడా వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి. ఈమె కూడా డీసెంట్ పాత్రలలో ... క్లాస్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

అలా నటిస్తున్న సమయం లోనే ఈమె రౌడీ బాయ్స్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో ఈమె హద్దులు మీరి తన అందాలను ఆరబోయడం ... లిప్ లాక్ సన్నివేశాలలో పాల్గొనడంతో కొంత మంది ప్రేక్షకులు ఈమెను విపరీతంగా ఇష్టపడడం మొదలు పెట్టారు. కానీ ఈమెను మొదటి నుండి క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో చూసి అభిమానించిన వారు మాత్రం అనుపమ అంతలా రొమాన్స్ చేయడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఈ బ్యూటీ మాత్రం ఎప్పుడూ ఒకేలా నటిస్తే ఏం కిక్ ఉంటుంది. అందుకే ఇలాంటి పాత్రలో కూడా చేయాలి అని చెప్పుకొచ్చింది.

తాజాగా అనుపమ "టిల్లు స్క్వేర్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ విపరీతమైన అందాలను ఆరబోసినట్లు ఈ సినిమా ప్రచార చిత్రాలను చూస్తేనే అర్థం అవుతుంది. ఇక తాజాగా ఈమె సినిమాల్లో రొమాన్స్ చేయడం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖలు చేసింది. తాజాగా అనుపమ సినిమా సెట్ లో వందల మంది ఉంటారు. వారందరి ముందు రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో క్యారెక్టర్ లో లీనమవుతూ ఆడియన్స్ మెప్పించేలా నటించడం సులువు కాదు అని చెప్పింది. ఇక చాలా మంది ఈ సినిమాలోని కిస్ సీన్ల గురించే మాట్లాడుకుంటున్నారు అని కూడా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: