తెలుగులో మొదటిసారిగా చైల్డ్ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి సీతాకోకచిలుక అనే చిత్రం ద్వారా తెలుగు తేరకు పరిచయమయ్యింది షీలా. ఆ తర్వాతే హీరోయిన్ గా ఎదిగింది షీలా. తమిళ సినీ ఇండస్ట్రీలో మొదటిసారిగా పూమ్ కాట్రుతిరుంబుమా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దాదాపుగా బాలనటిగా 20 పైగా సినిమాలలో నటించింది షీలా. ఇక తెలుగులో పరుగు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంది. ఆ తరువాత ఎన్టీఆర్ తో అదుర్స్, రామ్ తో మస్కా వంటి సినిమాలను నటించిన కూడా సక్సెస్ కాలేకపోయింది.

అయితే సరైన అవకాశాలు రాకపోవడంతో 2020లో ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి దూరమయ్యింది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఇక తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్ బిజినెస్ల్లో చేస్తోందట షీలా. షీలా 2008లో పరుగు సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ నంది అవార్డును కూడా అందుకున్నారు. షీలా తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ ,మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించింది.

చివరిసారిగా తెలుగులో 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి బిజినెస్ వైపుగా అడుగులు వేసింది. అప్పుడప్పుడు ఎక్కువగా శీల ప్రముఖ దేవాలయాలలో కనిపిస్తూ ఉంటుంది దీంతో అభిమానులు మాత్రం హీరోయిన్ షీలా గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ సర్చింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు కానీ షేర్ చేసే ఫోటోలు మాత్రం ఎప్పుడు క్యూట్గానే అభిమానులను నెట్టిజెన్స్ ని ఆకట్టుకునే విధంగానే షేర్ చేస్తూ ఉంటుంది షీలా. అయితే గతంలో కూడా పలు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: