"ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా..?" ఈ డైలాగ్ పోకిరి సినిమాలో మహేష్ బాబు నోటి నుండి వింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది . ఈ డైలాగ్ ఎంత సెన్సేషన్ హిట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే . సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది.  కానీ ఈ డైలాగ్ మాత్రం ప్రతి ఒక్కరు తమ లైఫ్ లో వాడుతూనే వస్తున్నారు . అంతలా జనాలకి బాగా కనెక్ట్ అయింది . అయితే ఇప్పుడు ఇదే డైలాగ్ ని హీరోయిన్ శ్రీనిధి శెట్టికి అప్లికేబుల్ చేస్తున్నారు జనాలు .


శ్రీనిధి శెట్టి అప్పుడెప్పుడో కేజీఎఫ్ సినిమాలో నటించింది. హిట్ కొట్టింది . ఆ తర్వాత బోలెడన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి . కానీ ఆమె ఏ ఒక్కదానికి సైన్ చేయలేదు.  శ్రీనిధి శెట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు నాని సరసన హిట్ 3 సినిమాలో నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  దీంతో శ్రీనిధి శెట్టి పేరు మరొకసారి మారుమ్రోగిపోతుంది . వచ్చిన ప్రతి సినిమాకి సైన్ చేయడం కాదు జనాలను ఎంటర్టైన్ చేసే కంటెంట్ ఉన్న సినిమాలకు సైన్ చేయడమే శ్రీనిధి టార్గెట్ అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.



కాగా హిట్ త్రీ సినిమా చూసిన తర్వాత శ్రీనిధికి చాలా మంది స్టార్ డైరెక్టర్ లు మళ్ళీ కాల్ చేసి ఆఫర్స్ ఇవ్వడం ప్రారంభించినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఆమె ఒక బంగారం లాంటి ఆఫర్ ని పట్టేసినట్టు తెలుస్తుంది. అది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం గమనార్హం . సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ సినిమా కి కమిట్ అయ్యాడు.  అయితే ఈ సినిమాలో చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ వచ్చాయి . అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి శ్రీనిధి కూడా చేరినట్లు తెలుస్తుంది . రష్మిక మందన్నా.. శ్రీ లీల .. జాన్వి కపూర్ వీళ్లంతా కామన్.  డిఫరెంట్ గా ఉండే హీరోయిన్ కావాలి అంటూ సుకుమార్..  శ్రీనిధి పేరుని తెరపైకి తీసుకొచ్చారట . రామ్ చరణ్ ఓకే చేస్తే ఆమె అఫీషియల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రకటించేస్తారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: