
జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాని 3D,8K లో రిలీజ్ చేసేందుకు సైతం చిత్ర బృందం సిద్ధమయ్యింది. ఎందుకోసం ఏకంగా 8 కోట్ల రూపాయల ఖర్చు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఓల్డ్ చిత్రానికి 8K లో రిలీజ్ చేయడం అంటే అది చిరంజీవి చిత్రానికే దక్కిందని చెప్పవచ్చు అయితే త్రీడీలో ఈ సినిమా మరింత బ్యూటిఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అటు మెగాస్టార్ అభిమానులు శ్రీదేవి అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీ రిలీజ్ ల సినిమాల హవా కొనసాగుతూ ఉన్నది. దీనివల్ల అటు నిర్మాతలు కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టుకుంటున్నారు. మరి కొంతమంది ఇలా వచ్చిన డబ్బులను ఇతరత్రా సేవా కార్యక్రమాలకు కూడా వినియోగిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి అలాగే డైరెక్టర్ అనిల్ రావు పూడితో కూడా తన తదుపరి చిత్రాన్ని లైన్ లో పెట్టారు. ఈసారి అభిమానులను మరింత ఆకట్టుకునే విధంగా తన చిత్రాలను ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి.