బాలీవుడ్ స్టార్ హీరో రణ‌బీర్ కపూర్ , హీరోయిన్ అలియా భట్ ఇద్దరూ అగ్ర స్టార్లుగా ఉంటూ బాగా సంపాదిస్తున్నారు .. ఈ స్టార్ కపుల్ కు రాహా అనే గారాల కూతురు కూడా ఉంది .. అలా వీరిద్దరూ సంపాదించిన వీళ్ళ ఆస్తి లో కొంత భాగాన్ని ఆమె పేరట కూడా రాస్తున్నారు .. అలా రెండేళ్ల వయసుకే ఈ గారాల పట్టి రూ. 250 కోట్ల రూపాయల వారసురాలిగా మారింది .. ముం బైలో బాంద్రాలో రణ్‌బీర్ కపూర్ కు వారసత్వంగా వచ్చిన ఇల్లు కూడా ఉంది .. రాజ్‌ కపూర్ కు చెందిన ఇల్లు ఇది .. ఆ తర్వాత రిషి కపూర్ ఈ ఇంటి లోనే ఉన్నారు .. అది వారసత్వంగా రణబీర్ కు వచ్చి చేరింది .. ఆ ఇంటిని దాదాపు ఏడాదిన్నర గా రీ మోడలింగ్ చేయిస్తున్నారు రణ్‌బీర్ , ఆలియా దంపతులు ..

 ఇన్ని సంవత్సరాలకు 6 అంతస్తుల లగ్జరీ భవనం రెడీ అయింది .. దాదాపు 250 కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఆ భవనాన్ని తన కూతురు రాహ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు ఈ దంపతులు . అలాగే కేవలం వారి కూతురుని దృష్టిలో పెట్టుకుని ఆ భారీ బంగ్లాన్ని డిజైన్ చేయించుకున్నారు .. ఇక వచ్చే దీపావళి కి కూతురు తో కలిసి అందులో సెలబ్రేట్ చేసుకోవాలన్నది ఈ దంపతుల కోరిక .. అలాగే ర‌ణ్‌బీర్ కు ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు .  అది అతని వారసత్వానికి గుర్తు .. అదే విధంగా రణ్‌బీర్ ఈ నివాసాన్ని ఎంతో సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు .  కూతురు అతని జీవితంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కలిసివస్తుంది .. అందుకే ఈ సెంటిమెంట్ ఇంటిని తన కూతురి పేరిట పెట్టేసాడు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: