
ఆ తర్వాత పలు యాడ్స్లో మెరిసిన ప్రీతి.. 1999లో `మళవిల్లు` అనే మూవీతో మలయాళంలోకి, `హలో`తో తమిళంలోకి, `తమ్ముడు`తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశింది. 2000లో యశ్రాజ్ బ్యానర్లో వచ్చిన `మొహబ్బతే` సినిమాలో చిన్నదే అయినా గుర్తుండిపోయే పాత్రలో నటించింది. అమీషా పటేల్, కిమ్ శర్మలతో పాటు ఆ కాలంలో న్యూ కమర్స్ లిస్ట్లో నిలిచింది. ఆ దెబ్బతో ప్రీతి కొంత కాలం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా నార్త్లో ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడింది.

ప్రస్తుతం కుటుంబ జీవితం, చిన్న చిన్న ఫిల్మ్ ప్రాజెక్టులు, సోషల్ వర్క్తో బిజీగా ఉంటుంది. అలాగే భర్త పర్విన్ తో కలిసి `స్వెన్ ఎంటర్టైన్మెంట్` అనే కంపెనీని రన్ చేస్తోంది. ఈ సంస్థ ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్లో సేవలు అందిస్తోంది. ప్రీతి `ప్రో పంజా లీగ్` అనే ఆర్మ్ రెజ్లింగ్ టోర్నమెంట్కు కో-ఫౌండర్గానూ ఉంది. ఇకపోతే ఆమె ఫిట్నెస్ లవర్ కూడా. తరచూ యోగా, వర్కౌట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ప్రీతి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. రీసెంట్గా ఓ ర్యాలీలో ఆమెను చూసి చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. ఫేస్లో ఛేంజస్ వచ్చినప్పటికీ ప్రీతి తన ఫిజిక్ను మాత్రం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుండటం విశేషం.
