తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మేనేజర్ ని తొలగించినట్లుగా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. తనకి మేనేజర్ గా పనిచేసినటువంటి మహేంద్ర గారు రివిల్ అయ్యారు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది అనసూయ. నాకు మేనేజర్ గా పనిచేసినటువంటి మిస్టర్ మహేంద్ర, తన సుదీర్ఘ ప్రయాణం, వృత్తిపరమైన ప్రయాణం తర్వాత ఆయన రివిల్ అయ్యారంటూ తెలిపారు. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపింది.
ఇన్ని రోజులు నాకు మేనేజర్ గా ఆయన చేసిన సహాయం, కృషి కి మహేంద్రకు తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాసుకొచ్చింది. ఈ విషయం పైన కొంతమంది నెటిజన్స్ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. రివిల్ అని అంటారు ఎందుకు మేడమ్.. మేనేజర్ రిజైన్ చేసి ఈ గోల నుంచి తప్పించుకున్నానని ఆనందపడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది తెలివైనవాడు బ్రతికిపోయాడు అంటు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో సంచలనంగా మారింది. కానీ అనసూయ తన మేనేజర్ ఎందుకు రిజైన్ చేశారని విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి