కోలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో తమిళ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమపై కూడా భారీ ఎత్తున కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తుంది. కొంత కాలం క్రితం ఈయన నటించి , దర్శకత్వం వహించిన లవ్ టుడే మూవీ ని తెలుగు లో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. దానితో ఈ సినిమా ద్వారా నటుడిగా , దర్శకుడిగా ప్రదీప్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన డ్రాగన్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ ని కూడా తెలుగులో విడుదల చేశాడు. ఈ సినిమా కూడా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈయన క్రేజ్ తెలుగులో మరింత గా పెరిగిపోయింది. తాజాగా ఈ నటుడు డ్యూడ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు దక్కాయి. ప్రస్తుతం కూడా ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతుంది.

మూవీ బుక్ మై షో ఆప్ లో అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో 1.4 ప్లస్ మిలియన్ సేల్ అయినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. బుక్ మై షో లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 1.4 ప్లస్ మిలియన్ టికెట్లు సేల్ అయ్యాయి అంటేనే అర్థం అవుతుంది ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ రేంజ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: