టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో వస్తున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకేక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే వీరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది


సుకుమార్ తో సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే టాలీవుడ్లో ఒక డైరెక్టర్ తో రామ్ చరణ్  సినిమా అంటే అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. ముఖ్యంగా అభిమానులే ఆ డైరెక్టర్ తో సినిమా వద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మెహర్ రమేష్.


టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన మెహర్ రమేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలలో ఎక్కువగా డిజాస్టర్లే ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన బిల్లా సినిమా తప్ప మరే సినిమా ఇతర హీరో అభిమానులను ఆకట్టుకోలేదు. చివరిగా చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన ఇది కూడా అభిమానులను నిరాశపరిచింది. అలా డైరెక్టర్ మెహర్ రమేష్ తో సినిమాలు చేసిన హీరోల విషయానికి వస్తే వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి హీరోలతో చేశారు. ఇందులో ఎన్టీఆర్ తో శక్తి, కంత్రి సినిమాలు చేయగా రెండు డిజాస్టర్లుగానే మిగిలాయి. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా అనే టాక్ వినిపించగానే అభిమానులు కంగారు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: