టాలీవుడ్ లో ఇప్పుడు చర్చ జరుగుతున్న ప్రధాన విషయం ఇదే. ఇందస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.  అక్కినేని నాగ చైతన్య అండ్ వర్డ్ మ్యాజిషియన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలసి సినిమా చేయబోతున్నారన్న వార్త. టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఈ ప్రాజెక్ట్‌పై హడావిడి మొదలైంది.  దీని పై అఫిషియల్ ప్రకటన అయితే రాలేదు కానీ.. ఇన్ సైడ్ లో మాత్రం గట్టిగా కన్ ఫామ్ అనే టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ తన సిగ్నేచర్ క్లాస్–మాస్ టచ్‌తో, చైతన్య యొక్క సాఫ్ట్ యాక్టింగ్ స్టైల్‌ను కలపబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ వినగానే ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ ఎగసిపడుతోంది.ఇంతకాలం రొమాంటిక్ హీరోగా, యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన నాగ చైతన్య, ఇటీవల వేర్వేరు జానర్స్‌లో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే తన డైలాగ్ రైటింగ్, ఎమోషన్ బిల్డింగ్, ఫ్యామిలీ అండ్ లవ్ బ్యాలెన్స్‌కి పేరుగాంచాడు. ఈ ఇద్దరూ కలిస్తే ఆ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అని టాలీవుడ్ అంతా ఎదురుచూస్తోంది.


ఇక హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో లీడ్ రోల్‌లో లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజును తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆమె చేసిన పాత్రలతో యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మమిత, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. సినిమా స్క్రిప్ట్ పక్కా అయిందని  సమాచారం. త్రివిక్రమ్ తనకు తెలిసిన బలమైన ఎమోషనల్ రూట్‌తో, చైతన్యకు ఒక కొత్త డైమెన్షన్ చూపించే విధంగా కథను మలుస్తున్నాడట. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని టాక్. అంతేకాదు వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారట.



ఫ్యాన్స్‌కి అయితే ఈ కాంబినేషన్ విన్నప్పుడే హర్షం ఆపుకోలేని స్థాయిలో ఉంది. ఎందుకంటే చైతన్య యొక్క చార్మ్, త్రివిక్రమ్ యొక్క క్లాస్ టచ్ కలిస్తే — అది డెఫినెట్‌గా ఒక “లవ్లీ సినమాటిక్ ఫీస్ట్” కానుందని వాళ్లు నమ్ముతున్నారు. ఇక షూట్ మొదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఒక్కటే – నాగ చైతన్యత్రివిక్రమ్ కాంబో నిజంగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ కాంబినేషన్స్ ఆఫ్ 2026 అంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: