సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి కుటుంబంలో గత కొద్ది రోజులుగా గొడవలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరిగిన గొడవల కారణం చేత అటు మోహన్ బాబుతో పాటు కుటుంబం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో మనోజ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడం జరిగింది. ఆ సమయంలోనే తన తమ్ముడికి సపోర్టివ్ గా మంచు లక్ష్మి నిలబడింది. అయితే తన తమ్ముళ్లు ఇద్దరు గొడవపడినప్పటికీ సైలెంట్ గానే ఉంది మంచి లక్ష్మి.


చివరికి మోహన్ బాబు, విష్ణు  పైన కూడా మనోజ్ కేసు పెట్టగా ఆ తర్వాత నెమ్మదిగా గొడవలు కూడా  సర్దుమునిగినట్లుగా కనిపించాయి. తాజాగా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ నా కూతురు ఇంతకుముందు విష్ణు వాళ్ల స్కూల్లోనే చదివింది, ఆరు నెలలు వెళ్లిన తర్వాత సడన్గా మానిపించేసాను, కుటుంబంలో గొడవలు జరగడం సర్వసాధారణమే అందరూ కూడా తన కూతురి పైన ఎక్కువగా కేర్ చూపడమే కాకుండా చాలా సేవలు చేసే వారిని అవన్నీ నచ్చకే తన కూతురిని చిన్న స్కూల్ కి పంపించాను అంటూ తెలిపింది.


కుటుంబంలో గొడవల పైన క్లారిటీ ఇస్తూ తాను మనోజ్ మిరాయ్  సినిమా ఈవెంట్ లో మాట్లాడిన దాన్ని కట్ చేసి తప్పుగా ప్రచారం చేశారని , కేవలం విష్ణు గురించి మాట్లాడకపోయినా తిట్టినట్టు కొన్ని థంబ్ నైల్స్ పెట్టి చాలామంది వైరల్ గా చేశారు అంటే తెలిపింది మంచు లక్ష్మి. తన తమ్ముళ్ల మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసిన వారందరూ కూడా నాశనం అవుతారని తెలియజేసింది. వారి కర్మకి వారి అనుభవిస్తారంటూ మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చివరిగా మంచు లక్ష్మి దక్ష అనే చిత్రంలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: