తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం విజయవంతంగా ప్రసారమవుతోంది. మొత్తం మీద 15 మంది కంటెస్టెంట్ తో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా 6 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఇందులో శ్రేష్ఠ వర్మ, మర్యాద మనీష్, హరీష్, ప్రియా, ఫ్లోరా షైనీ, రమ్య మోక్ష, దమ్ము శ్రీజ, భరణి లాంటి వారు ఎలిమినేట్ కాగా గతవారం మళ్లీ భరణి రీ యంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన మాదిరి కేవలం 3 వారాలలోనే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది.


గౌరవ్, మాధురి డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ గౌరవ్ ఎలిమినేట్ ఈ వారం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మాదిరి ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ జర్నీ సంబంధించి చూపించగా ఎమోషనల్ అయింది మాధురి. అయితే తను ఎలిమినేట్ అవ్వడం చేత తనుజ కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలిమినేట్ తర్వాత స్టేజి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కంటెంట్ గురించి తెలియజేసింది మాధురి.


వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాధురి మొదటి రోజా హౌస్ లో పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో అప్పుడే తన ఆట తీరని మార్చేసింది. మొదటిలో మాధురి అంటే గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆ తర్వాత తన ఆట మాట తీరుతో జనాలకు బాగా దగ్గరయింది. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. దాదాపుగా మూడు వారాలు ఇంట్లో ఉన్న మాధురికి రూ. 1.20 లక్షల రూపాయలు అందుకున్నట్లుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: