ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి వార్తలే ట్రెండ్ అవుతున్నాయి. నేషనల్ లెవల్ మీడియాలో కూడా ఆమె పెళ్లి చర్చలు పెద్ద ఎత్తున నడుస్తుండటం ఆమెకు ఉన్న అపారమైన క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్‌కి నిదర్శనం. సమంత వ్యక్తిగత జీవితంపై దేశవ్యాప్తంగా ఇంత ఆసక్తి కనబరచడం నిజంగా ఆమె స్టార్‌డమ్ ఏమిటో చూపిస్తుంది.ఈ నేపథ్యంలో, సమంత–రాజ్ నిడిమోరు పెళ్లికి హాజరైన అతిథులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ తమ ఫోటోలను షేర్ చేస్తూ ఈ వేడుకను మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా రాజ్ నిడిమోరు సిస్టర్ షేర్ చేసిన ఫోటోలు టాప్ రేంజ్‌లో ట్రెండ్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెళ్లి వేడుకలోని ప్రతి చిన్న క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


ఇక ఇదే సమయంలో, కొన్ని ఏఐ  ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏఐ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో చూపిస్తున్నట్లుగా, రామ్ చరణ్ సమంత–రాజ్ పెళ్లికి హాజరైనట్లు తయారు చేసిన ఏఐ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సమంతతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులు ఇచ్చినట్లు, పెళ్లి మండపంలో నిలబడి ఉన్నట్లు, అలాగే పెళ్లి రీత్యా క్లిక్స్ తీసినట్లుగా కనిపించే ఏఐ  ఇమేజెస్ చూసి చాలామంది నిజంగానే అవునా? రామ్ చరణ్ సమంత పెళ్లికి వచ్చాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.



అంతేకాదు, రామ్ చరణ్ పెళ్లి స్పాట్‌లో ఉన్నట్లుగా చూపించే ఒక ఏఐ వీడియో కూడా బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో చరణ్ అన్ని కార్యాల్లో పాల్గొన్నట్టుగా చూపించడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. కానీ తరువాత అది పూర్తిగా ఏఐ సృష్టించిన వీడియో మాయాజాలమని స్పష్టమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం సమంత పెళ్లికి చరణ్ పెద్ద దిక్కు అనే ట్యాగ్‌తో షేర్ అవుతున్న ఏఐ ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ఎంత రియలిస్టిక్ విజువల్స్ క్రియేట్ చేయగలదో ఇవి మరోసారి రుజువు చేస్తున్నాయి. మొత్తం మీద, సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి వేడుక, అందులో షేర్ అయిన అసలు ఫోటోలు, గెస్ట్ ల ఫోటోలు… వాటికి తోడు వైరల్ అవుతున్న ఏ ఐ కంటెంట్—ఇవి అన్నీ కలిసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘనంగా ట్రెండ్ అవుతున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: