కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ చాలా సంవత్సరాల క్రితం కే ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో రూపొందిన పడియప్ప అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సౌందర్య , రమ్య కృష్ణ హీరోయిన్లుగా నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా లోని రజనీ కాంత్ , సౌందర్య , రమ్య కృష్ణ నటన లకి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇకపోతే రమ్య కృష్ణ ఈ సినిమాలో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ సినిమా లో రమ్య కృష్ణ తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రమ్య కృష్ణ కెరియర్ లోనే ఈ సినిమా మైల్ స్టోన్ గా మిగిలి పోయింది. ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను నరసింహ అనే పేరుతో తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా పడియప్ప మూవీ ని పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. రీ రిలీజ్ లో భాగంగా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు పది రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 13.75 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ప్రపంచ వ్యాప్తంగా 18.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: