ఈ మద్య వరుసగా కామెడీ, హర్రర్ నేపథ్యంలో వస్తున్న సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే పలు సినిమాలు ఇదే కాన్సెప్ట్ తో మంచి విజయాలు అదుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో టెలివిజన్ రంగంలో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకున్న యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి తీసిన ‘రాజుగారి గది’ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ హర్రర్, కామెడీ తో పాటు ఆర్గాన్స్ డొనేషన్ పై మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.
ఆ తర్వాత నాగార్జున,సమంత ముఖ్య పాత్రల్లో ‘రాజుగారి గది 2’ తీశారు. ఈ సినిమా కూడా హర్రర్, కామెడీ తో పాటు ర్యాగింగ్ బూతంపై మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేక పోయింది. రెండేళ్లకు అంటే 2019కి.. డైరెక్టర్ ఓంకార్ ఈ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ `రాజుగారిగది 3`లో తమన్నాను తీసుకురావాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తర్వాత కాజల్ తో సంప్రదించారట..కానీ ఒకే కాలేదు. తాప్సీ మాత్రం ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి మరో పేరు వచ్చింది.
ఒకప్పుడు బాలీవుడ్ బుల్లితెరపై సంచలనం సృష్టించిన చిన్నారి పెళ్లికూతురు తెలుగు లో ‘ఉయ్యాల జంపాల’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. `సినిమా చూపిస్త మావ`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ అవికా గోర్ మధ్యలో న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో స్క్రీన్ప్లే కోర్సు నేర్చుకోవడానికి సినిమాలు దూరమైంది. తాజాగా ఇప్పుడు ‘రాజుగారి గది3’లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓంకార్ దర్శక నిర్మాణంలో సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది.