ఇటీవల యుద్ధ విరమణ కోసం అటు ఉక్రెయిన్ రష్యా దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలలో ఇరు దేశాలు ఓకే నిర్ణయానికి రాకపోవడంతో చివరికి చర్చలు విఫలం గానే ముగిసిపోయాయి అని చెప్పాలి. ఇక చర్చలు విఫలం అయిన నేపథ్యంలో మరింత దూకుడుగా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది రష్య. ఇక ఇటీవలే ఏకంగా ఉక్రెయిన్లోని హాస్పిటల్స్ ని టార్గెట్ గా చేసుకుని బాంబుల దాడి చేస్తుంది. ఇకపోతే ఇటీవల ఒక ఖరీదైన హోటల్ పై రష్యా బాంబు దాడి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.
ఇక ఈ బాంబు దాడికి సంబంధించిన సంఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇక ఉక్రెయిన్ లో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కెవ్ లో ఒక భవంతి పై రాకెట్ ఎటాక్ చేసింది రష్య. ఇక ఈ బాంబు దాడితో ఒక్కసారిగా ఆ భవనం మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో 11 మంది పౌరులు మరణించారు అని తెలుస్తోంది. చాలా మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు ప్రస్తుతం వందలాది రష్యా యుద్ద ట్యాంకులు తరలి వెళ్తున్నాయి అన్న విషయాన్ని కూడా అటు ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి