అయితే ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని కమిషనర్ ఎంతో ఆవేదనకు గురయ్యారు. సెప్టెంబర్ 10 వతేదీన 29 సంవత్సరాల మహిళా అధికారి కాలేజ్ గ్రౌండ్ లో గేమ్స్ ఆడుతూ కింద పడడంతో కాలికి గాయం అయింది. దీనితో ఆమె మెడిసిన్ తీసుకుని విశ్రాంతి తీసుకుంది. మహిళా అధికారి నిద్ర పోతున్న సమయంలో ఎవరో ఆమెపై హత్యాచారం చేశారు. నిద్ర లేవగానే ఆమెకు విషయం అర్థమయింది. అయితే ఈ విషయం పట్ల క్యాంపస్ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ కేసు గాంధీ పురం మహిళ పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయింది.
విచారణలో తెలిసిన సమాచారం ప్రకారం, నిందితుడు ఛత్తీస్గఢ్ కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ అమ్రిందర్ అని తెలుసుకున్నారు. దీనితో అతనిని అరెస్ట్ చేశారు. కానీ ఇతనిని పోలీసులు డైరెక్ట్ గా విచారణ చేయకూడదని నిందితుడు తరపు న్యాయవాది చెప్పడంతో అతనిని కోర్టు లోనే విచారించనున్నారు. ఇతనిపై ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అమ్రిందర్ ఉడుమల్ పేట జైల్ లి ఉన్నారు. అమరీందర్ ను ఉరితీయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.