అయినా క్రూడ్ ఆయిల్ ధరలు తమ ప్రభుత్వ అధీనంలో ఉండవని.. ఆ ధరలను బట్టి పెట్రోల్ ధరలు మారుతుంటాయని తెలుసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే వాట్ పన్ను తగ్గించుకోవాలని చెప్పారు. అంతే కానీ అనవసరంగా తమపై బురద చల్లడం మానుకోవాలని అన్నారు.
అయితే.. ఏది ఏమైనా హిమాలయన్ వాటర్ బాటిల్ ఖరీదుతో పెట్రోల్ ధరలను పోల్చిన మంత్రిపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. పెట్రోల్ ధరలు వంద దాటిపోతున్నాయని.. ఒకవైపు జనం గగ్గోలు పెడుతుంటే.. మంచినీళ్ల కంటే పెట్రోల్ చీప్ గానే వస్తుందని చెప్పిన మంత్రిగారిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కావడం లేదు. అయినా ఈ విషయం తెలియక ఇన్నాళ్లూ, ప్రభుత్వం తమపై భారం మోపుతుందని ప్రజలంతా.. అపార్ధం చేసుకునేవాళ్ళు.. ఇప్పుడు ఈ మహానేత స్టేట్మెంట్ చూశాక అయినా జనం మారతారేమో చూడాలి. మంచినీళ్లను పెట్రోల్ తో సమానంగా అమ్మేలా చేసినందుకు జనం ఈ ప్రభుత్వాన్ని చూసి సంతోషపడాలేమో.