భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని భావిస్తోంది. అయితే, ఈ టోర్నీ ద్వారా బీసీసీఐ లాభాలు ఆర్జించే విషయం కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. ఎందుకంటే, ఈ టోర్నీకి కేంద్రం గనుక పూర్తిస్థాయిలో పన్ను మినహాయింపు ఇవ్వనట్టయితే... బీసీసీఐ పన్నుల రూపేణా రూ.906 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం పాక్షికంగా పన్ను మినహాయింపు ఇచ్చినా బీసీసీఐ రూ.227 కోట్ల వరకు చెల్లించక తప్పదు.