ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నీచరాజకీయాలకు, శవరాజకీయాలకు మరో పేరు అని ప్రజలు తిట్టిపోస్తున్నారు. ఉంటె తన ప్రభుత్వం ఉండాలి లేదంటే మరో ప్రభుత్వం కూలిపోవాలి అన్నట్టు తాను, తన సొంత పుత్రుడు, దత్తపుత్రుడు కలిసి ఇసుక అనే రాజకీయాన్ని చేస్తున్నారని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. 

                 

మొన్నటికి మొన్న సొంత పుత్రుడు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ తో నాలుగు గంటలపాటు దీక్ష చేయించాడు. నిన్న దత్తపుత్రుడు, జనసేన పార్టీ అధినేత పవన్ నాయుడుతో భవన్ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా విశాఖలో లాంగ్ మార్చ్ చేయించారు. ఈరోజు తానే విజయవాడలో ధర్నా చౌక్ లో 12 గంటల పాటు దీక్ష చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు.. ప్రస్తుతం చేస్తున్నాడు. 

                     

ఇసుకను ఉచితంగా పంపిణీ.. ప్రభుత్వం నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల భృతి.. ఆత్మహత్య చేసుకున్న భవన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలనే నినాదంతో చంద్రబాబు దీక్ష చేపట్టారు. అయితే గతంలో భవన కార్మికుల ప్రాణం తీసింది చంద్రబాబు అని, వారికీ ఎంతమాత్రం మీరు న్యాయం చేశారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

                      

చంద్రబాబు హయాంలో ఇసుకపై ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి.. ఒకానొకదశలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్నందుకు తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే, టీడీపీ నేతలు దాడి కూడా చేశారు. ఇన్ని చేసిన టీడీపీనే ఇప్పుడు దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది అని ట్విట్టర్ వేధికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: