బాలికలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి...వారిపై జరుగుతున్న ఆకృత్యాల్లో ఎక్కువగా మైనర్ బాలురులు చేస్తున్నవే కావడం గమనార్హం. సరిగ్గా ఇలాంటి ఘటనే దేశరాజధాని గుర్గావ్లో ఇటీవల జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి
సేవ చేయడానికి వచ్చిన సమీప బంధువు బాలికపై అత్యాచారానికి ఓడిగట్టాడు ఓ నీచుడు. దేశ రాజధాని గుర్గావ్లో జరిగింది ఈ సంఘటన. తాళ్లతో బెడ్పై కట్టేసి మరీ పాశవికంగా తన కోరికను తీర్చుకున్నాడు. ఈ టీనేజీ మృగాడి గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ సెక్టార్ 51లో ఓ ఫ్యామిలీ చాలా ఏళ్లుగా నివాసం ఉంటోంది.
బాలుడి తల్లి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. గుర్గావ్లోనే మరో ప్రాంతంలో ఉండే బాలుడికి వరుసకు అత్త అయిన వారి సమీప బంధువు తన కూతురును వదినకు సాయ పడేందుకు పంపింది. అయితే బాలుడు సదరు బాలికపై వక్రబుద్ధితో వ్యవహరించడం మొదలుపెట్టాడు. అదను కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడి తల్లి వైద్యం కోసం ఓ రోజూ సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన బాలుడు సదరు బాలికకు మాయమాటలు చెప్పి బెడ్ ఎక్కించాడు. అనంతరం బాలికను తాళ్లతో కట్టేసి అత్యాచారం చేశాడు. ఇలా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
అయితే ఈ విషయం బయట చెబితే చంపేస్తానని చెప్పడంతో భయపడిన ఆ బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. మరునాడు స్కూల్కు వెళ్లిన బాలిక స్పృహ తప్పి పడిపోయింది. కొంతవిశ్రాంతి అనంతరం స్పృహాలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది. ఈమేరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరు మైనర్లు కావడంతో జువైనల్ కోర్టులో విచారణ అనంతరం శిక్ష ఖరారు కానుంది. పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు చేయడం జరిగింది. పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.